- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆటోకు నిప్పంటించిన డ్రైవర్.. ప్రజాభవన్ వద్ద హైటెన్షన్
దిశ, వెబ్డెస్క్: ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ‘మహాలక్ష్మీ’ పథకంలో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆటోవాలాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళలే ఆటోలను ఎక్కువగా ఎక్కుతారని.. వారు ఎక్కకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని అంటున్నారు. తమకు గిరాకీ ఉండటం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ప్రజాభవన్ వద్ద తన ఆటోకు నిప్పంటించాడు. ఆటో డ్రైవర్ను మహబూబ్ నగర్కు చెందిన దేవా(45)గా పోలీసులు గుర్తించారు. ఆటో కిరాయిలు దొరకడం లేదని ఆటోడ్రైవర్ మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. కిరాయిలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. అయితే వెంటనే తేరుకున్న ప్రజా భవన్ సిబ్బంది, పోలీసులు ఆటోలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డ్రైవర్ దేవాను అదుపులోకి తీసుకున్నారు.